శ్రీరమ్యంబుగ శ్రీగిరియాత్రకు , కూరిమి సతితో కూడి నడిచితిని
పల్లెలు పురములు పట్టణంబులు, పేటలుదాటితి, అడవులు కొండలు అన్నీ దాటితి
కంటిని శ్రీగిరి కన్నుల నిండా।వింటిని మహిమలు వీనులనిండా
ఆమహిమలు నేనేమని చెప్పదు,ఆమహిలోపలఎన్నడు చూడము
ధారుణి లోపల ధౌతాచలమది, మేరుని కంటెను మిక్కుటమైనది
బ్రహ్మనిర్మల బృహిశృంగబులు ,నిర్మలమగు మణిక్య కూటములు
కోటలుకొమ్మలు గోపురంబులు, తెరపి లేని బహుదేవాలయములు
పుణ్యస్ధలంబులు, పుణ్యవనంబులు, వాటమైన పూదోటలు మిక్కిలి
మాటలు నేర్చిన మంచి మృగంబులు, కామథేనువులు కల్పవృక్షములు
క్షేమ కరంబగు చింతామణులు,అమృతగుండంబులు
కడునైష్టకమును కలిగిన విప్రులు, విడువక శంభునివేడెటి రాజులు
సంతత లింగార్చన గలశైవులు, శాంతులైన వేదాంతసిద్ధులు
ఘనఘనమ్రోగెటి ఘంటానాదములు ,విజయఘోషయగు శంఖానాదములు
వీరశైవులువీరాంగంబులు, సాథు బృందములుకామిత భక్తులు ,అగరుధూపములు
జపములు చేసెటి జంగమోత్తములు, తపములు చేసెటి తాపసోత్తములు
ప్రమధులు భక్తులుశైవగణంబులు , గట్టిగ ఇదిభూకైలాశమ్మని
తప్పిపోక పాతాళ గంగలో, తెప్పునతేలుచు తీర్ధంబాడుచు
చెలగుచు మడివస్త్రంబులుకట్టితి , అనువుగ నుదుట విభూతిధరిస్తిని
పొలుపుగ మెడరుద్రాక్షలు దాల్చితి , గురుకటాక్షమును గోప్యము చేసితి
గురుమంత్రంబునుజపమును చేసితి , అకలంకుడనైఆశజయిస్తిని
శివపంచాక్షరి మనసున నిలిపితి, శివతత్వము పరిశీలన చేసితి
పంచేంద్రియంబులు పదిలము చేసితి , పంచ ముద్రలభ్యాసము చేసితి
అంతర్ముఖుడనైతిని, నాదబ్రహ్మనాదమువింటిని , లోపల తుమ్మెద నాదము వింటిని
వెలుగులకెల్లా వెలుగై వెలిగెడు, ఆలోపలదీపము కంటిని
ఈవల చంద్రుండావల సూర్యుడు, కలిగిన స్థావరమైననిదానము కంటిని
కంటికి ఇంపగు పండు వెన్నెల, విరిసినషట్కమలంబులు, షట్తలంబులు, పిండాండములో బ్రహ్మాండముకంటిని
అంతట అక్కడ చెంగల్వ కొలనులో , ఆడుచున్నరాచహంసను పట్టితి
చాలవేయి స్తంభాలమేడలో, బాలిక కూడుకుకేళిసలిపితిని
మల్లికార్జునిని మదిలో దలచితి , ముందర బృంగికిమ్రొక్కితిని
నందికేశ్వరుని నమ్మిభజించితి,చండీశ్వరునకు దండము పెట్టితి
మళ్ళీమళ్ళీ మహిమను పొగడుచు , పిళ్ళారయ్యకు ప్రియముగ మ్రొక్కితి
ద్వారపాలకుల దర్శన మాయను, ద్వారమందు రతనాల గద్దెపై
చూచితి నెవ్వరు చూడని లింగము ,చూచితి కేవల సుందర లింగము
నిరుపద్రవమగు నిశ్చల లింగం, ఆదితేజ్యమగుఐక్యలింగం
రాజితమైన విరాజిత లింగం,పూజ్యనీయమగుపురాణ లింగం
లింగము కనుగొని లింగ దేహినై , లింగాంగులలో లింగ నిర్గుణ సంగతి కంటిని
లింగమందు మది లీనముచేసితి , జీవన్ముక్తుడనైతిని
అంకమందు బ్రమరాంబిక ఉండగా, మల్లికార్జునిని కోరి పూజించితి
దీపము పెట్టితి దివ్య దేహునకు ,ధూపమువేసితి ధూర్జటికప్పుడు
తుమ్మిపూలతోపూజిస్తిని, కమ్మని నైవేద్యముపెట్టితి
సాగిలిమ్రెుక్కితి సర్వేశ్వరునకు,జయజయజయజయ జంగమరాయ
ఆదిదేవుడవు ఆత్మ శరణ్య, దయతప్పకధవళ శరీర, భయము బాపు మీభక్తనిదాన
ఎన్నిజన్మములు ఎత్తినవాడను, నిన్ను తలంపకనీచుడనైతిని
ఎన్నడు ఏవిధమెరుగనివాడను,దుష్టమానసడ గౌరీరమణ
తామస గుణములు తగులాటంబలు, నియముతప్పిన నీచవర్తనుడ, నిత్యదరిద్రుడ అత్యాశయుడను అజాఞన పశువువు
చేయరాని దుశ్చ్టేష్టలు చేసితి, బాయరాని మీభక్తులబాసితి
సంసారంబను సంకెళ్ళలో, హింసపెట్టమిక ఏలుమి తండ్రి
ముల్లోకంబులు ముంచెడి గంగను,సలలితముగాజడధరియుిస్తిని
గొప్ప చేసినిన్నుకొలచిన బంటును, తప్పకచంద్రునితలధరియిస్తిని
విన్నునిచేతను కన్నుపూజగొని సన్నుతి కెక్కిన చక్రమిచ్చితివి
ఆనకశైలకుమారిక కోరిన, సగము శరీరము ఇస్తిని
మూడులోకముల ముఖ్యమునీవే, మూడుమూర్తులకు మూలము నీవే
దాతవు నీవే, భ్ర్రాతవు నీవే,తల్లివి నీవే, తండ్రివి నీవే , బ్రహ్మము నీవే , సర్వము నీవే
పాలముంచుమిక నీటముంచుమి , పాలబడితనో ఫాల లోచన అనుచుప్రణతులనిడుచు ఇదిచదివిన వారికి .
ఫలశ్రుతి:
కాలువలు త్రవ్వించి గన్నేర్లు వేసి
పూలు కోసి శివునకు పూజించిన ఫలము
గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి
పాలు తీసి అభిక్షేకము చేసిన ఫలము
పల్లెలు పురములు పట్టణంబులు, పేటలుదాటితి, అడవులు కొండలు అన్నీ దాటితి
కంటిని శ్రీగిరి కన్నుల నిండా।వింటిని మహిమలు వీనులనిండా
ఆమహిమలు నేనేమని చెప్పదు,ఆమహిలోపలఎన్నడు చూడము
ధారుణి లోపల ధౌతాచలమది, మేరుని కంటెను మిక్కుటమైనది
బ్రహ్మనిర్మల బృహిశృంగబులు ,నిర్మలమగు మణిక్య కూటములు
కోటలుకొమ్మలు గోపురంబులు, తెరపి లేని బహుదేవాలయములు
పుణ్యస్ధలంబులు, పుణ్యవనంబులు, వాటమైన పూదోటలు మిక్కిలి
మాటలు నేర్చిన మంచి మృగంబులు, కామథేనువులు కల్పవృక్షములు
క్షేమ కరంబగు చింతామణులు,అమృతగుండంబులు
కడునైష్టకమును కలిగిన విప్రులు, విడువక శంభునివేడెటి రాజులు
సంతత లింగార్చన గలశైవులు, శాంతులైన వేదాంతసిద్ధులు
ఘనఘనమ్రోగెటి ఘంటానాదములు ,విజయఘోషయగు శంఖానాదములు
వీరశైవులువీరాంగంబులు, సాథు బృందములుకామిత భక్తులు ,అగరుధూపములు
జపములు చేసెటి జంగమోత్తములు, తపములు చేసెటి తాపసోత్తములు
ప్రమధులు భక్తులుశైవగణంబులు , గట్టిగ ఇదిభూకైలాశమ్మని
తప్పిపోక పాతాళ గంగలో, తెప్పునతేలుచు తీర్ధంబాడుచు
చెలగుచు మడివస్త్రంబులుకట్టితి , అనువుగ నుదుట విభూతిధరిస్తిని
పొలుపుగ మెడరుద్రాక్షలు దాల్చితి , గురుకటాక్షమును గోప్యము చేసితి
గురుమంత్రంబునుజపమును చేసితి , అకలంకుడనైఆశజయిస్తిని
శివపంచాక్షరి మనసున నిలిపితి, శివతత్వము పరిశీలన చేసితి
పంచేంద్రియంబులు పదిలము చేసితి , పంచ ముద్రలభ్యాసము చేసితి
అంతర్ముఖుడనైతిని, నాదబ్రహ్మనాదమువింటిని , లోపల తుమ్మెద నాదము వింటిని
వెలుగులకెల్లా వెలుగై వెలిగెడు, ఆలోపలదీపము కంటిని
ఈవల చంద్రుండావల సూర్యుడు, కలిగిన స్థావరమైననిదానము కంటిని
కంటికి ఇంపగు పండు వెన్నెల, విరిసినషట్కమలంబులు, షట్తలంబులు, పిండాండములో బ్రహ్మాండముకంటిని
అంతట అక్కడ చెంగల్వ కొలనులో , ఆడుచున్నరాచహంసను పట్టితి
చాలవేయి స్తంభాలమేడలో, బాలిక కూడుకుకేళిసలిపితిని
మల్లికార్జునిని మదిలో దలచితి , ముందర బృంగికిమ్రొక్కితిని
నందికేశ్వరుని నమ్మిభజించితి,చండీశ్వరునకు దండము పెట్టితి
మళ్ళీమళ్ళీ మహిమను పొగడుచు , పిళ్ళారయ్యకు ప్రియముగ మ్రొక్కితి
ద్వారపాలకుల దర్శన మాయను, ద్వారమందు రతనాల గద్దెపై
చూచితి నెవ్వరు చూడని లింగము ,చూచితి కేవల సుందర లింగము
నిరుపద్రవమగు నిశ్చల లింగం, ఆదితేజ్యమగుఐక్యలింగం
రాజితమైన విరాజిత లింగం,పూజ్యనీయమగుపురాణ లింగం
లింగము కనుగొని లింగ దేహినై , లింగాంగులలో లింగ నిర్గుణ సంగతి కంటిని
లింగమందు మది లీనముచేసితి , జీవన్ముక్తుడనైతిని
అంకమందు బ్రమరాంబిక ఉండగా, మల్లికార్జునిని కోరి పూజించితి
దీపము పెట్టితి దివ్య దేహునకు ,ధూపమువేసితి ధూర్జటికప్పుడు
తుమ్మిపూలతోపూజిస్తిని, కమ్మని నైవేద్యముపెట్టితి
సాగిలిమ్రెుక్కితి సర్వేశ్వరునకు,జయజయజయజయ జంగమరాయ
ఆదిదేవుడవు ఆత్మ శరణ్య, దయతప్పకధవళ శరీర, భయము బాపు మీభక్తనిదాన
ఎన్నిజన్మములు ఎత్తినవాడను, నిన్ను తలంపకనీచుడనైతిని
ఎన్నడు ఏవిధమెరుగనివాడను,దుష్టమానసడ గౌరీరమణ
తామస గుణములు తగులాటంబలు, నియముతప్పిన నీచవర్తనుడ, నిత్యదరిద్రుడ అత్యాశయుడను అజాఞన పశువువు
చేయరాని దుశ్చ్టేష్టలు చేసితి, బాయరాని మీభక్తులబాసితి
సంసారంబను సంకెళ్ళలో, హింసపెట్టమిక ఏలుమి తండ్రి
ముల్లోకంబులు ముంచెడి గంగను,సలలితముగాజడధరియుిస్తిని
గొప్ప చేసినిన్నుకొలచిన బంటును, తప్పకచంద్రునితలధరియిస్తిని
విన్నునిచేతను కన్నుపూజగొని సన్నుతి కెక్కిన చక్రమిచ్చితివి
ఆనకశైలకుమారిక కోరిన, సగము శరీరము ఇస్తిని
మూడులోకముల ముఖ్యమునీవే, మూడుమూర్తులకు మూలము నీవే
దాతవు నీవే, భ్ర్రాతవు నీవే,తల్లివి నీవే, తండ్రివి నీవే , బ్రహ్మము నీవే , సర్వము నీవే
పాలముంచుమిక నీటముంచుమి , పాలబడితనో ఫాల లోచన అనుచుప్రణతులనిడుచు ఇదిచదివిన వారికి .
ఫలశ్రుతి:
కాలువలు త్రవ్వించి గన్నేర్లు వేసి
పూలు కోసి శివునకు పూజించిన ఫలము
గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి
పాలు తీసి అభిక్షేకము చేసిన ఫలము
ఆకలితో నున్న అన్నార్తులకును
కమ్మనీ భోజనంబిచ్చిన ఫలము
భీతితో నున్నట్టి కడు దీనులకును
శరణిచ్చి రక్షంచు విశేష ఫలము
అంత కన్నా ఫలము అధికమయ్యుండు .
No comments:
Post a Comment